Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో కన్న కూతురుపైనే గొడ్డలితో దాడి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:43 IST)
ఎన్ని చర్యలు తీసుకున్నా మందుబాబుల ఘాతుకాలకు కళ్లెం వేయడం సాధ్యపడటం లేదు. మద్యం తాగి ఓ తండ్రి గొడ్డలితో కూతురిపై దాడి చేసాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తుమరాడ జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తోంది. 
 
ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. తన తల్లిదండ్రుల ఇల్లు కూడా సమీపంలోనే ఉంది. కానీ కొంతకాలంగా తండ్రి రామకృష్ణ మందుకు బానిసై, జ్యోతితో తరచూ గొడవపడుతుండేవాడు. యధావిధిగా మద్యం సేవించి రామకృష్ణ మంగళవారం మధ్యాహ్నం కూతురి ఇంటికి వచ్చాడు. 
 
ఆమెతో ఘర్షణ పడి గొడ్డలితో దాడి చేశాడు. బాధితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. పొరుగువారు అక్కడికి వచ్చే సరికి రామకృష్ణ పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments