Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:22 IST)
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో కిక్కుకోసం శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. వివరాలిలా వున్నాయి... కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉండే నలుగురు యాచకులు, మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో మద్యం ధరలు పెరిగాయి.
 
ఫలితంగా వారు గత కొద్దిరోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నారట. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఇటు కురిచేడులో రమణయ్య శానిటైజర్‌తో పాటు నాటు సారా కలిపి తాగడంతో మరణించాడు.
 
అదే జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. ఒకే యాచక బృందానికి చెందిన వీరంతా వేరువేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మత్తుపై వీరికున్న మోజు మరణానికి దారితీసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments