Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:22 IST)
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో కిక్కుకోసం శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. వివరాలిలా వున్నాయి... కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉండే నలుగురు యాచకులు, మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో మద్యం ధరలు పెరిగాయి.
 
ఫలితంగా వారు గత కొద్దిరోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నారట. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఇటు కురిచేడులో రమణయ్య శానిటైజర్‌తో పాటు నాటు సారా కలిపి తాగడంతో మరణించాడు.
 
అదే జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. ఒకే యాచక బృందానికి చెందిన వీరంతా వేరువేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మత్తుపై వీరికున్న మోజు మరణానికి దారితీసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments