Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ బై పోల్ : వైకాపా అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:32 IST)
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి అక్టోబరు 30న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసే అభ్యర్థిగా డాక్టర్ సుధ పేరును ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. 
 
గురువారం తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. 
 
2019లో దాదాపు 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చేందిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments