Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధునిక భారత నిర్మాణం కోసం జీవిత కాల పోరాటం చేసిన అంబేద్కర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:31 IST)
కుల మత రహిత, ఆధునిక భారతదేశం కోసం భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేసారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దళితుల పట్ల నాటి సమాజంలో ఉన్న సామాజిక వివక్షను అరికట్టడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. 
 
డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ తరగతి కులాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారన్నారు. భారత రాజ్యాంగ పితామహునిగా దేశానికి ఆయన వెలకట్ట లేని సేవలు చేసారని గవర్నర్ ప్రస్తుతించారు. అంబేద్కర్ ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా అన్ని వర్గాలతో కొనియాడబడ్డారని పేర్కొన్నారు.
 
గొప్ప స్వాతంత్య్ర సమరయోధునిగా దేశం కోసం ఎంతో శ్రమించారని, కుల రహిత సమాజం కోసం విశేష కృషి చేయటమే కాక, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవని గౌరవ గవర్నర్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments