Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం... డొక్కా, కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా?

అమరావతి : రానున్న ఎన్నికల్లో మెదీని ప్రధాని కాకుండా బిజెపిని ఓడించడమే టిడిపి లక్ష్యమని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలోని 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (17:40 IST)
అమరావతి : రానున్న ఎన్నికల్లో మెదీని ప్రధాని కాకుండా బిజెపిని ఓడించడమే టిడిపి లక్ష్యమని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలోని 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసిపి ఎంపిలు సభలో వుండి కూడా ఎన్నికలో పాల్గొనకుండా ఉండటాన్ని బట్టి బిజెపి-వైసిపిల లాలూచీ రాజకీయాలు బహిర్గతం అయ్యాయని పేర్కొన్నారు. 
 
అంతకుముందు ఆ పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి బిజెపిని ఓడిస్తామని చెప్పి బిజెపికి అవసరమైతే ఓటేసి సాయపడదామనే ఉద్దేశ్యంతో సభలో ఉండటం ఎంతవరకు సబబు అని ఆయన వైసిపిని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ రాహూల్ గాంధీ అడగలేదు కాబట్టి మేము ఓటింగ్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశారని, అలాంటి కారణాలేమైనా ఉంటే వైసిపి చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అంతేగాక గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అడగకుండానే మద్దతు ఇచ్చారని, ఇటీవల జరిగిన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా బిజెపికి వైసిపి ఓటు వేసిందని మాణిక్యవర ప్రసాద్ గుర్తు చేశారు. వైసిపి ఈవిధంగా ప్రజలను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎందుకు మోసం చేస్తున్నదో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
 
రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిపై పోరాడుతూ ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రత్యేక హోదా సాధనకై ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తుంటే అందుకు భిన్నంగా వైసిపి బిజెపితో ప్రయాణం చేయడం ఎంతవరకూ సబబని డొక్కా మాణిక్య ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేయాల్సిన ఆవశ్యకత టిడిపికి లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో బిజెపి అధికారానికి రాకుండా నివారించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని మాణిక్య వరప్రసాద్ పునరుద్ఘాటించారు. కాగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో తెదేపా ఏమయినా కలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి.. ఏం జరుగుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments