Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:34 IST)
కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి మేకలు కాస్తుంటాడు. సాయంత్రం మేకలను మేపు నుండి తోలుకువచ్చి, ఇంటి బయట సేదతీరుతున్నాడు. 
 
ఇంతలో కొంతమంది వ్యక్తులు ఆ దారిలో వెళ్తుంటే అతని కాపలా కుక్కలు వారిని చూసి మొరిగాయి. వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయినా, ఇంటి ఎదురుగా నివసించే మల్లికార్జునాచారి, ఆయన భార్య సరిత, కొడుకు శ్రావణ్ కుక్కల అరుపులకు విసిగిపోయి రాళ్ల దాడికి దిగారు. కుక్కలపై రాళ్లు విసిరినందుకు కృష్ణయ్య కోప్పడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
గొడవ పెద్దదయి మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులు కృష్ణయ్య మీద రాళ్లు విసరడం ప్రారంభించారు. అవి ముఖానికి తగిలి గాయాలయ్యాయి. కొన్ని పళ్లు కూడా రాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments