Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సంప్రదాయాలను హేళన చేస్తారా? శ్రీనివాసానంద స్వామి ఆవేదన

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (16:38 IST)
హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని  శ్రీనివాసానంద స్వామి అన్నారు. విశాఖ‌ప‌ట్నం ప్రెస్ క్ల‌బ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే, ప్ర‌భుత్వం నుంచి స్పందన ఏదని శ్రీనివాసానంద స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో తాము చూశామని, అపుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఇప్పుడు మళ్లీ అదే విధంగా త‌మ మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. సింహాచ‌లం దేవ‌స్థానం పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని  శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నా దేవాదాయశాఖ మంత్రి మాట్లాడరెందుకని స్వామి ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన పై 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామన్నారని, కానీ ఏమైందని  శ్రీనివాసానంద స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. దేవాలయాలకు పట్టిన దుస్ధితిపై ఎంపీ  విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరని శ్రీనివాసానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments