Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సంప్రదాయాలను హేళన చేస్తారా? శ్రీనివాసానంద స్వామి ఆవేదన

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (16:38 IST)
హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని  శ్రీనివాసానంద స్వామి అన్నారు. విశాఖ‌ప‌ట్నం ప్రెస్ క్ల‌బ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే, ప్ర‌భుత్వం నుంచి స్పందన ఏదని శ్రీనివాసానంద స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో తాము చూశామని, అపుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఇప్పుడు మళ్లీ అదే విధంగా త‌మ మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. సింహాచ‌లం దేవ‌స్థానం పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని  శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నా దేవాదాయశాఖ మంత్రి మాట్లాడరెందుకని స్వామి ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన పై 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామన్నారని, కానీ ఏమైందని  శ్రీనివాసానంద స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. దేవాలయాలకు పట్టిన దుస్ధితిపై ఎంపీ  విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరని శ్రీనివాసానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments