Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలపైన ఉండే గ్రామం గురించి తెలుసా?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:01 IST)
యెమెన్ ఓ అరబ్ దేశం. ఈ దేశానికి రాజధాని సనా. ఈ రాజధాని పరిధిలో అల్ హుతైబ్ అనే సుందరమైన గ్రామం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే... ఇది భూ ఉపరితలం నుంచి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై కొలువై ఉంది.

ఈ గ్రామంలో అల్ బోహ్రా, అల్ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. అసలు విషయానికొస్తే... ఈ ఊర్లో ఇప్పటివరకు వర్షం పడలేదు. ఈ ఊరు మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడమే అందుకు కారణం.

అల్ హుతైబ్ లో ఎండ, చలి మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఎంతో ఎత్తయిన కొండపై ఈ ఊరు ఉండడం వల్ల మేఘాలన్నీ ఈ ఊరు కిందిగా వెళుతుంటాయి. మేఘాలు కొండ కింది భాగంలో వర్షించేటప్పుడు ఈ ఊరి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది.

దాంతో ఈ గ్రామం ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి అల్ హుతైబ్ గ్రామాన్ని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. ఎత్తయిన ఈ కొండపై నిల్చుని, దిగువన ఉన్న మేఘాల నుంచి భూమ్మీదకు జాలువారే వర్షపాతాన్ని చూడడం ఓ మధురానుభూతిగా భావిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments