Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులో వృద్ధురాలిపై అత్యాచారం, కొట్టి చంపిన గ్రామస్థులు

చిత్తూరులో వృద్ధురాలిపై అత్యాచారం, కొట్టి చంపిన గ్రామస్థులు
, శనివారం, 29 మే 2021 (14:07 IST)
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవ మృగం నీచానికి ఒడిగట్టింది. ఒంటరి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అమానుషంగా అత్యాచారం చేసింది. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో కీచకుడిని కొట్టి చంపేశారు.

మహిళలపై నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు తెచ్చినా.. ఉరిశిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే కామంతో రెచ్చిపోతున్నారు కీచకులు. ఆఖరికి వృద్ధులను కూడా వదలని మానవ మృగాలు రోడ్లపై తిరుగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లివస్తున్న ఓ వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఆ విషయం తెలుసుకున్న గ్రామస్థులు కీచకుడి అరాచకాలు భరించలేక కొట్టిచంపేశారు. ఏపీలోని
 
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు..
పుంగనూరు మండలం అప్పిగానిపల్లెకి చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె మినీ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి బయలుదేరింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన అదే గ్రామానికి చెందని గురుమూర్తి(47) వనమలదిన్నె సబ్‌స్టేషన్ వెనుక పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. వృద్ధురాలనే కనీస కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పశువులా కామవాంఛలు తీర్చుకున్నాడు.
 
అనంతరం ఆమె మెడలోని చైను, చెవిదిద్దులు, ముక్కుపుడకతో సహా డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృగాడి పైశాచికంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు కొద్దిసేపటికి తేరుకుని వచ్చి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామ సమీపంలోనే గురుమూర్తి ఉన్నాడని తెలియడంతో అతన్ని పట్టుకొచ్చారు.
 
మూకుమ్మడిగా రాళ్లు. కట్టెలతో దాడి చేయడంతో నిందితుడు గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే నిందితుడు గురుమూర్తిపై గతంలోనూ అత్యాచారం కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Oxygen తరలిస్తున్న గూడ్సులో మంటలు