Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్విని హత్యకేసు.. ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (13:45 IST)
ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు సీఎం జగన్‌ను కలిశారు. దివ్య తేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి సుచరిత సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. వారికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తేజస్విని హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 
 
కాగా.. రెండు రోజుల క్రితం విద్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన హోంమంత్రి సూచరితను.. సీఎం గారిని కలిసే ఏర్పాటు చేయాలని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు. దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆమె ప్రత్యేకంగా చొరవ చూపించారు. 
 
అలాగే సాక్షుల విచారణ పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. పండగ సెలవులు ముగిశాక కోర్టుకు ఛార్జిషీటు సమర్పించనున్నారు. మరోవైపు నిందితుడు నాగేంద్రను సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో డిశ్చార్జ్‌ అనంతరం నాగేంద్రను విచారించనున్నారు పోలీసులు. 
 
దివ్య స్వయంగా గాయాలు చేసుకోలేదని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దివ్యపై కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నాగేంద్ర కోసుకున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments