Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో దారుణం.. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల పంపిణీ

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:06 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను మరింత క్షోభకు గురిచేసేలా అధికారులు వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనెను అందించారు.

ఈ నూనె ప్యాకెట్ల కాలపరిమితి గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు ఆ ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ..‘వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇలాంటి చర్యలతో మా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments