Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వెయ్యి కోట్లు భవన నిర్మాణ కూలీలకు పంచండి: జగన్ కు రఘురామ లేఖ

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (14:08 IST)
వైసీపీకి కంటిలో నలుసులా తయారైన ఆ పార్టీ అసంతుష్ట ఎంపీ రఘురామ కృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకున పెట్టే మరో లేఖను సంధించారు. గతంలో బిల్డర్ల నుంచి వసూలు చేసిన నిధి నుంచి వెయ్యి కోట్ల రూపాయలను భవన నిర్మాణ కార్మికులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన మంగళవారం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు.

వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారన్నారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments