Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసులో రోజుకో రిపోర్ట్... హైవేపై నేరాలకు పాల్పడిన నిందితులు..?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (12:32 IST)
దిశ కేసులో రోజుకో రిపోర్ట్ పోలీసులకు చేరుతోంది. నిందితులకు మరికొన్ని కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలకు కూడా టీంలను పంపారు. దిశకు మద్యం తాగించి ఆత్యాచారం చేసి.... హత్య చేసినట్లుగా ఫోరెన్సిక్ నివేదికలో బయట పడింది. డీఎన్‌ఏ అధారంగా పోలీసులు ఇంటరాగేషన్ స్పీడప్ చేస్తున్నారు.
 
దిశ కేసులో పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. దిశపై ఆత్యాచారం, హత్య, కాల్చి వేత కేసులకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటన స్థలంలో దొరికిన అన్ని ఆధారాలను ఫోరెన్సిక్‌కు పంపించారు పోలీసులు.

డీఎన్‌ఏ నివేదికలో కీలక ఆధారాలు లభించాయి. నలుగురు నిందితులు గతంలో చేసిన నేరాలు రిపోర్ట్‌లోని అంశాలు మ్యాచ్‌ అవుతున్నాయని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. 
 
హైవేపై గతంలో వీరంతా నేరాలు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజున సీపీ సజ్జనార్‌ తెలిపారు. దిశ శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించారు ఫోరెన్సిక్‌ నిపుణులు. అత్యాచారం చేయడానికి ముందు ఆమెకు మద్యం పట్టించినట్లు గుర్తించారు. అపాస్మారక స్థితిలోకి వెళ్లాక ఆ నలుగురు పాశావికంగా ఆత్యాచారం చేసి హత్య చేసి కాల్చి వేసినట్లు నిర్థారణకు వచ్చారు. 
 
ఇందుకోసం టోల్‌గేట్‌ సమీపంలోని వైన్‌ షాప్‌ దగ్గరే నిందితులు మద్యం కొనుగోలు చేసినట్లు ఆధారాలు సంపాదించారు పోలీసులు. ఆనాడు ఉదయం నుంచి రాత్రి వరకూ నలుగురు నిందితులు లిక్కర్‌ తాగుతూనే ఉన్నట్లు కూడా తెలుసుకున్నారు.  ఈ కేసులో నలుగురు నిందితుల నేర చరిత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు.  
 
గతంలో కూడా ఈ నలుగురు దిశ లాంటి ఘటనలకు పాల్పడి ఉంటారన్న కొణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపారు. హైవేల మీద దిశ మాదిరి జరిగిన కేసులను కూడా వెరిఫై చేస్తున్నారు. స్వగ్రామంలో నిందితులపై కొన్ని కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments