Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజస్వామి కిరీటాలు దొరికాయ్.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:39 IST)
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన కిరీటాల కేసును ఎట్టకేలకు ఛేదించారు అర్బన్ జిల్లా పోలీసులు. కిరీటాలను మాయం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడేని 
చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడు నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అనుబంధ ఆలయం కళ్యాణ వేంకటేశ్వరస్వామికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా  పోయాయి. 
 
అర్బన్ జిల్లా పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గత రెండు నెలల నుంచి నిందితుడి కోసం 
గాలిస్తున్నారు. మధ్యాహ్నం నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఒక కిరీటాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిరీటాన్ని నిందితుడు కుదవ పెట్టగా, మరో కిరీటాన్ని పగులగొట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. పాత నేరస్తులందరినీ పోలీసులు విచారిస్తూ వెళుతుండగా అసలు నిందితుడు బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments