తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (11:46 IST)
తిరుమల తిరుపతిలో మరోమారు చిరుతపులి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం సర్కిల్‌లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుని తితిదే విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 
 
కాగా, గతంలో పలుమార్లు చిరుతపులి తిరుమల కొండల్లో కనిపించి కలకలం రేపిన విషయం తెల్సిందే. వైకాపా ప్రభుత్వంలో ఓ చిరుత పులి ఓ బాలికపై దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణగా వైకాపా పాకలకులకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో కూడిన చేతికర్రలను కూడా ఇచ్చింది. ఈ చర్య విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొంతకాలం చిరుతపులి హడావుడి కనిపించలేదు. ఇపుడు మళ్లీ కనిపించడంతో కలకలం చెలరేగింది. దీంతో కానినడకన తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా నడిచి వెళ్లరాదని, సమూహాలుగా వెళ్ళాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments