మాస్కులు కట్టుకుని దర్శన టిక్కెట్ల కోసం శ్రీవారి భక్తులు, ఎంత పెద్ద క్యూలైనో గోవిందా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (18:25 IST)
ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్సనం కోసం టోకెన్లను మంజూరు చేసినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గరు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు ఎంతసేపయినా వేచి ఉంటారు. టోకెన్లను పొందుతారు. సరిగ్గా వారంరోజుల క్రితం నుంచి టోకెన్ల ప్రక్రియను టిటిడి నిలిపివేసింది.
 
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఈ నెల 30వ తేదీ వరకు అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో టోకెన్లను పొందేందుకు భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుపతిలో టోకెన్లను కేటాయించే మూడు ప్రాంతాల్లోను భక్తుల రద్దీ అదే స్థాయిలో కనిపించింది.
 
ముఖ్యంగా అలిపిరికి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరారు. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్ కనిపించింది. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. అయితే గతంలోలా గంటల తరబడి వేచి ఉన్నా టోకెన్లు లేక ఇబ్బంది పడి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈ సారి నాలుగు రోజులలో ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకునేందుకు టోకెన్లు ఇవ్వడంతో భక్తులు టోకెన్లతోనే తిరిగి వెళ్ళారు.
 
టోకెన్లు పొందిన స్థానికులు అయితే సరిపెట్టుకున్నారు గానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేదిలేక కొంతమంది భక్తులు మాత్రం వెనుతిరిగి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments