కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..

Webdunia
ఆదివారం, 26 మే 2019 (10:53 IST)
ఓ పూజారీ తెలిసో తెలియకో చేసిన పనికి పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. కొత్త కారుకు పూజ చేసిన తర్వాత ఆయన బ్రేక్‌ను కాలితో తొక్కాల్సిందిపోయి.. యాక్సిలేటర్‌పై కాలు తొక్కాడు. అంతే.. ఒక్కసారిగా ఆ కారు భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీశైలం పట్టణానికి చెందిన సిద్ధూ అనే పూజారి ఓ కొత్తకారును కొనుగోలు చేశాడు. దానికి స్థానికంగా ఉండే శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించేందుకు కారును తీసుకొచ్చాడు. ఈ కారుకు పూజలు ఆయనే స్వయంగా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments