Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..

Webdunia
ఆదివారం, 26 మే 2019 (10:53 IST)
ఓ పూజారీ తెలిసో తెలియకో చేసిన పనికి పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. కొత్త కారుకు పూజ చేసిన తర్వాత ఆయన బ్రేక్‌ను కాలితో తొక్కాల్సిందిపోయి.. యాక్సిలేటర్‌పై కాలు తొక్కాడు. అంతే.. ఒక్కసారిగా ఆ కారు భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీశైలం పట్టణానికి చెందిన సిద్ధూ అనే పూజారి ఓ కొత్తకారును కొనుగోలు చేశాడు. దానికి స్థానికంగా ఉండే శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించేందుకు కారును తీసుకొచ్చాడు. ఈ కారుకు పూజలు ఆయనే స్వయంగా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments