Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శనం, ఇలా ఆన్లైన్లో రిలీజ్, అలా భక్తులు బుక్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:52 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్సనానికి ఆన్లైన్ టిక్కెట్లను ఎప్పుడూ ఆన్లైన్లో ఉంచినా భక్తులు పెద్దఎత్తున బుక్ చేసేసుకుంటున్నారు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల తరువాత ఆలయం తెరుచుకోవడం దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుంచి అందించడం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఆన్లైన్‌లోను, ఆఫ్‌లోను కౌంటర్ల ద్వారా టోకెన్లను అందిస్తున్నారు.
 
కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యను విడతలవారీగా పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆన్‌లైన్లో జూలై నెలకు సంబంధించిన టోకెన్లను విడుదల చేశారు. ప్రతిరోజు భక్తులు 9 వేల టోకెన్ల వరకు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు.
 
ఇక కౌంటర్ల ద్వారా అయితే 30వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. అయితే ఆన్‌లైన్లో ఇప్పటికే సగానికి పైగా టిక్కెట్లను భక్తులు బుక్ చేసేసుకున్నారట. కేవలం 300 రూపాయల శీఘ్ర దర్సనం మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తులు టోకెన్లను వెంటవెంటనే బుక్ చేసేసుకుంటున్నారని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
గతంలో సేవా టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేసే వెంట వెంటనే బుక్ చేసుకునేవారని, ఇప్పుడైతే 300 రూపాయల టోకెన్లనే భక్తులు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం టిటిడి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments