Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి బోటు ప్రమాదం-12 మంది ప్రాణాలు జలార్పణం.. 22 మంది సురక్షితం

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:46 IST)
గోదావరి బోటు ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 22మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి అధికారులు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవు. 
 
బోటు యజమాని పేరు వెంకటరమణగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 62మంది వున్నారని చెప్పారు. వీరిలో 51 మంది ప్రయాణికులు 11 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రమాదం జరిగిన రాయల్ వశిష్ట బోటులో 22మంది హైదరాబాద్ వాసులు, 9 మంది విశాఖ వాసులు, ఇద్దరు రాజమండ్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments