Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బ‌య‌టికి వ‌చ్చేసా, ఇక్క‌డంతా నిర్బంధ‌మే సార్, బాబుతో ఉమ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:20 IST)
నేను జైలు నుంచి వ‌చ్చేసా... ఇక్క‌డ అంతా నిర్బంధ‌మే కొన‌సాగుతోంది సార్ అంటూ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు మాజీ మంత్రి దేవినేని ఉమ వివ‌రించారు. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ‌చ్చారు. ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికిన‌ మాజీ మంత్రి దేవినేని ఉమా, అమరావతి జేఏసీ మహిళా నేతలు, టీడీపీ కార్యకర్తలు... ఉత్సాహంగా జేజేలు ప‌లికారు. 
 
అధినేత చంద్రబాబు రాకతో గన్నవరం విమానాశ్రయం లో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెల‌కొంది. దేవినేని ఉమాను  అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై రాజమండ్రి జైలు నుండి విడుద‌లై మొద‌టి సారి అధినేత‌ను క‌లిశారు దేవినేని ఉమ‌. తాను జైలు నుంచి విడుద‌ల అయి, విజయవాడకు వచ్చే సమయంలో హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మూసేసి త‌న‌ను పోలీసుల దిగ్బంధం లో విజయవాడకు తరలించార‌ని అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వివ‌రించారు. 
 
అమరావతి రాజధాని పోరాటం 600 రోజులు అయిన సందర్భంగా నిన్న అమరావతి తలపెట్టిన కార్యక్రమంలో మహిళలు పై పోలీసుల దాడి చేశార‌ని పార్టీ అధినేతకు అమరావతి జేఏసీ మహిళా నాయకులు వివ‌రించారు. వైసీపీ ఆగ‌డాల‌కు ముగింపు ప‌లికే రోజు వ‌స్తుంద‌ని అధినేత చంద్ర‌బాబు అంద‌రినీ వారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments