నేను బ‌య‌టికి వ‌చ్చేసా, ఇక్క‌డంతా నిర్బంధ‌మే సార్, బాబుతో ఉమ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:20 IST)
నేను జైలు నుంచి వ‌చ్చేసా... ఇక్క‌డ అంతా నిర్బంధ‌మే కొన‌సాగుతోంది సార్ అంటూ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు మాజీ మంత్రి దేవినేని ఉమ వివ‌రించారు. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ‌చ్చారు. ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికిన‌ మాజీ మంత్రి దేవినేని ఉమా, అమరావతి జేఏసీ మహిళా నేతలు, టీడీపీ కార్యకర్తలు... ఉత్సాహంగా జేజేలు ప‌లికారు. 
 
అధినేత చంద్రబాబు రాకతో గన్నవరం విమానాశ్రయం లో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెల‌కొంది. దేవినేని ఉమాను  అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై రాజమండ్రి జైలు నుండి విడుద‌లై మొద‌టి సారి అధినేత‌ను క‌లిశారు దేవినేని ఉమ‌. తాను జైలు నుంచి విడుద‌ల అయి, విజయవాడకు వచ్చే సమయంలో హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మూసేసి త‌న‌ను పోలీసుల దిగ్బంధం లో విజయవాడకు తరలించార‌ని అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వివ‌రించారు. 
 
అమరావతి రాజధాని పోరాటం 600 రోజులు అయిన సందర్భంగా నిన్న అమరావతి తలపెట్టిన కార్యక్రమంలో మహిళలు పై పోలీసుల దాడి చేశార‌ని పార్టీ అధినేతకు అమరావతి జేఏసీ మహిళా నాయకులు వివ‌రించారు. వైసీపీ ఆగ‌డాల‌కు ముగింపు ప‌లికే రోజు వ‌స్తుంద‌ని అధినేత చంద్ర‌బాబు అంద‌రినీ వారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments