Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక ముఖ్యమంత్రి అధికారి, సెక్రటరీని చెప్పన్నా.. చెప్పన్నా అంటే ఏందయ్యా చెప్పేది?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:36 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిందంటూ జగన్ ప్రచారం చేశారనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు తెలుసుకుని అవాక్కయ్యారన్నారు. 
 
అందుకే అధికారులను, సెక్రటరీలను చెప్పన్నా.. చెప్పన్నా అంటూ పదేపదే అడుగుతున్నారన్నారు. నిజానికి ఏదైనా ఉంటే కదా చెప్పడానికి అంటూ దేవినేని అన్నారు. పైగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని దేవనేని స్పష్టం చేశారు. 
 
పైగా, పోలవరం నిర్మాణం పనులు పూర్తికాలేదని గగ్గోలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి... ఇటీవల పోలవరం సందర్శన సమయంలో 70 శాతం మేరకు పనులు పూర్తయివుండటాన్ని చూసి అవాక్కయ్యారన్నారు.
 
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం కాలువల్లో మట్టిని తీసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ(కేవీపీ రామచంద్రరావు)ను అడగాలనీ, ఆయన ఢిల్లీలో ఉంటాడని దేవినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments