రాష్ట్రంలో ఆగిన అభివృద్ధి : చంద్రబాబు

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:31 IST)
ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ… కియా తమిళనాడుకు తరలిపోతోందన్నారు. కియాతో చర్చలు నిజమేనని తమిళనాడు అధికారులు స్పష్టం చేశారన్నారు.

తమ వాళ్లకే ఉద్యోగాలివ్వాలని వైసీపీ నేతలు బెదిరించారన్నారు. కియాను తరలించాలనుకోవడం దారుణమన్నారు. పిచ్చి తుగ్లక్ తో సమస్య తప్పదని కియా భయపడిందన్నారు. తప్పని పరిస్థితుల్లోనే కియా మార్చాల్సి వస్తోందంటున్నారు.

కియాను వీళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కియాకు సమస్యలు వచ్చాయని చంద్రబాబు నాయుడు అన్నారు.

కియాకు సహాయ నిరాకరణ చేయాలని అనంత రైతుల్ని జగన్ రెచ్చగొట్టారన్నారు. కియా సీఈవోను వైసీపీ ఎంపీ బెదిరించారన్నారు.

కియాతో రాష్ట్రానికి రూ.13,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కియా కంపెనీతో 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments