Webdunia - Bharat's app for daily news and videos

Install App

449 మంది విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన డిప్యూటీ సీఎం పవన్

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (22:36 IST)
గత నాలుగేళ్లుగా రక్షిత త్రాగునీటి సదుపాయం లేక అవస్థలు పడుతున్న 449 మంది విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తాగునీటి సమస్యను తెలుసుకుని, సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయం గుర్తించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులు రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు.
 
4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో RO ప్లాంట్‌కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా, విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. పాఠశాలలో మంచినీటి కుళాయిల నుంచి మంచినీటిని తమ బాటిళ్లలో నింపుకుంటూ విద్యార్థులు ఎంతో సంతోషపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments