Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (08:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై - పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరందాటిందని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. 
 
అయితే, దీని ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో జలాశంయ 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
 
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా అటుగా వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భారీ వర్షంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments