Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (08:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై - పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరందాటిందని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. 
 
అయితే, దీని ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో జలాశంయ 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
 
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా అటుగా వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భారీ వర్షంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments