Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (08:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై - పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరందాటిందని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. 
 
అయితే, దీని ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో జలాశంయ 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
 
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా అటుగా వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భారీ వర్షంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments