Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై అలిగిన రోజమ్మ... అక్కడకు డుమ్మా.. కీలక పదవి ఇచ్చే దిశగా...

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (11:04 IST)
వైకాపా అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే. రోజా అలకబూనారు. వరుసగా రెండుసార్లు గెలిచిన తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు. కానీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెను జగన్ పక్కనబెట్టారు. పైగా, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. దీంతో ఆమెకు మొండిచేయి చూపక తప్పలేదు. 
 
దీంతో జగన్‌పై ఆమె అలక బూనారు. ఫలితంగా శనివారం ఉదయం వెలగపూడిలో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరుకాలేదు. ఈ విషయం జగన్‌ దృష్టికి చేరింది. దీంతో ఆయన ఆమెకు సముచిత స్థానం కల్పించాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
అయితే, రోజా ఓ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువల్ల ఆమెకు ఈ పదవిని అప్పగించవచ్చా? అన్న విషయమై ఆయన అడ్వొకేట్ జనరల్ సలహాను కోరినట్టు వినికిడి. మామూలుగా అయితే, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రోజా నియామకానికి లీగల్ చిక్కులు అడ్డుకాకుంటే, అతి త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments