Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మచ్చలు.. అందంగా లేనని డిగ్రీ విద్యార్థి సూసైడ్?

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (14:08 IST)
ముఖంపై నల్లటి మచ్చలు ఉండటంతో అందంగా లేనని భావించిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిగ్రీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ (20) ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. ఈ మచ్చలు పోయేందుకు ఎన్నో రకాలైన క్రీములు వాడాడు. వైద్యులను సంప్రదించాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో కుంగిపోయాడు.
 
కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్‌ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు.. సోంపేట ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. నేడు కరోనా పరీక్ష చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments