Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువు న‌ష్టం దావా.. విచార‌ణ‌ జూన్ 21కి వాయిదా

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:18 IST)
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై ఆ ప‌త్రిక‌పై టీటీడీ రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ మేరకు తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిపై టీటీడీ పరువు నష్టం దావాపై  మంగ‌ళ‌వారం నాడు తిరుప‌తి నాలుగో అద‌న‌పు జ‌డ్జి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 
 
ఈ విచార‌ణ‌కు టీటీడీ త‌ర‌ఫున న్యాయ‌వాదిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హాజ‌ర‌య్యారు. ఇక ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫు న్యాయ‌వాదిగా క్రాంతిచైత‌న్య హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా ఇరువురు న్యాయవాదుల మ‌ధ్య వాదోప‌వాదాలు హోరాహోరీగా సాగాయి. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసుల‌పై కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచార‌ణ‌ను జూన్ 21కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments