దండుపాళ్యం బ్యాచ్... 4 నెలలు భరిద్దాం, అందుకే తెదేపాతో కలిసి పోటీ: పవన్ కల్యాణ్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (21:59 IST)
విశాఖ హార్బరులో అగ్నిప్రమాదానికి దగ్ధమైన బోటు యజమానులైన మత్స్యకారులకు, వారి కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం బోట్లు నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో మాట్లాడారు.
 
''నేను ఇచ్చిన డబ్బు పూర్తిగా బాధితులకు జరిగిన నష్టాన్ని తీర్చగలను అని నేను అనను. కానీ కష్టం వస్తే ఆదుకునేందుకు మీకోసం జనసేన వుంది, వీరమహిళలు వున్నారు, పవన్ కళ్యాణ్ వున్నాడు. నేను బుక్ చేసుకున్న విమానాన్ని బెదిరించి వెనక్కి పంపేశారు. నేను వస్తున్నాను అంటే వైసిపి నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. ఆంధ్రలో అడుగుపెడుతున్నానంటే చాలు విమానాలు ఆపుతారు, రోడ్డుపైన రాకుండా దిగ్బంధిస్తారు. నేను వస్తున్నానంటే ఎందుకు అంత భయం?
 
దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. వైసీపీ రౌడీ మూకలు తయారయ్యారు. మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తాం, చీకటిగా ఉంది, ఇక్కడ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తాం, ఆడవారు అర్థరాత్రి ధైర్యంగా తిరిగే పరిస్థితులు తీసుకొస్తాం. వైసీపీని ఓడించడానికి ఛాన్స్ తీసుకోదలచుకొలేదు. అందుకే టీడీపితో పొత్తు పెట్టుకున్నాము, రేపటి రోజున 5 వేల తేడాతో సీట్ ఓడిపోకూడదు, గెలిస్తే 25 వేల మెజారిటీతో గెలవాలి." అని విశాఖ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments