Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర తుఫానుగా మారిన మోచా... శ్రీలంక వద్ద ఏర్పడిన ఆవర్తనం

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:04 IST)
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని, ఇది ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై ఆ కేంద్ర అధికారి ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ, ఈ నెల పదో తేదీన వాయుగుండం తుఫానుగా మారనుండగా, దీనికి యెమెన్ దేశం మోచాగా నామకరణం చేసిందని తెలిపారు. 
 
ఈ తుఫాను తీవ్రరూపం దాల్చుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 9వ తేదీన ఉత్తర దిశగా కేంద్ర బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తర్వాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. మంగళవారానికి దీనిపై పూర్తి వివరాలు వెల్లడించగమని చెప్పారు. 
 
అందువల్ల రాష్ట్రంలోని ఓడరేవులకు ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. సముద్రంలో ట్రాలర్లు, మరబోట్లు ద్వారా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకోవాలని కోరారు. 
 
మరోవైపు విదేసీ వాతావరణ అధ్యయన సంస్థలు కూడా మోచా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ఈ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాకు పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments