Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చిన మాండస్ తుఫాను

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:34 IST)
తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారనష్టాన్ని మిగిల్చింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలు ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. 
 
రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీకాళహస్తి - తడ మార్గంలో సున్నపు కాలువపై ఒక బస్సు చిక్కుకునిపోయింది. ఇందులోని ప్రయాణికులను సురక్షితంగ రక్షించారు. రేణిగుంట విమానాశ్రానికి రావాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. 
 
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏకంగా 281 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీరంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మాండస్ తుఫాను శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments