Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూ సడలింపులు... ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం...

Webdunia
సోమవారం, 5 జులై 2021 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోవున్న కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అయితే, ఉభయగోదావరి జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేస్తామన్నారు. పాజిటీవీటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఆంక్షల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.
 
అయితే, ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలను మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతి లభించనుంది. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలకు కొవిడ్‌ నిబంధనలతో అనుమతి లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేశారు.
 
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి నానితో పాటు... ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments