Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:04 IST)
శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఏఎస్పీ చింతపల్లి సబ్ డివిజన్ చింతపల్లి మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తాజంగి గ్రామంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు.
 
అనంతరం తాజంగి గ్రామ గిరిజనులతో ఏఎస్పీ గారు మాట్లాడుతూ మూడవ విడత 17వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, స్వేచ్ఛగా సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీ గ్రామ అభివృద్ధి కొరకు ఎవరైతే బాగుంటుందో అట్టివారిని ఎన్నుకోవాలన్నారు. 
 
స్థానిక పోలింగ్ కేంద్రాన్ని, తాజంగి గ్రామం చుట్టుప్రక్కల ప్రదేశాలను డ్రోన్ కెమెరాతో వీక్షించి, తనిఖీ చేసి అధికారులకు భద్రతా చర్యలపట్ల సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తాజంగి గిరిజనులు సహకరించాలని, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలుతో ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎటువంటి గొడవలు జరగకుండా సంయమనంతో ఉండాలని అన్నారు. శ్రీ టి.శ్రీను సిఐ చింతపల్లి సర్కిల్, శ్రీ మహమ్మద్ అలీ షరీఫ్ ఎస్సై చింతపల్లి పిఎస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments