Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివృష్టితో అనంతపురం జిల్లాలో నీట మునిగిన పంటలు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:40 IST)
అతివృష్టి కారణంగా అనంతపురం జిల్లాలో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరపి లేని వర్షాలతో పొలాల్లోనే పంటలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది.
 
లక్షల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట వర్షాలకు నేలపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో దెబ్బతిన్న పంటలపై రైతులు దిగ్బ్రాంతికి గురైయ్యారు. ఏటా పంటలు ఎండిపోయి కరువు ఛాయలు కమ్ముకునే అనంతపురంలో ఈ ఏడాది భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. దీంతో వేరుశెనగ, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
దీనికి తోడు వరి, పత్తి పంటలు కూడా నీట మునగడంతో రైతులు లక్షల్లో పెట్టుబడులను కోల్పోయారు. అకాల వర్షాలతో నిండా మునిగిన రైతులను ఆదుకోవాలను రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments