Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు పట్టించుకోలేదని.. కిరోసిన్ పోసి తగులబెట్టిన ప్రియుడు..

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (14:57 IST)
ప్రియురాలు పట్టించుకోలేదని ప్రియుడు ఆమెను కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వీరి పేర్లు సానియా, సల్మాన్. వివరాల్లోనికి వస్తే.. వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇక ఈ విషయం గురించి ఇద్దరు వాళ్ల ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
ప్రియుడు ఇంట్లో వారి ప్రేమ విషయాన్ని అందరు అంగీకరించారు. కానీ, ప్రియురాలి ఇంట్లో తిరస్కరించారు. దాంతో ప్రేమికులిద్దరు అసహానానికి లోనయ్యారు. ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. ఐతే ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెకు మరో అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ అమ్మాయి మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నేను ప్రేమించిన అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 
 
అయినా కూడా కుటుంబ సభ్యులు సానియా మాటను వినకుండా.. బలవంతంగా మరో అబ్బాయితో పెళ్లి చేశారు. కొన్ని రోజులు అలానే గడిచింది. సానియా కూడా రాజీపడి తన భర్తతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నది. సల్మాన్ కోపంగా ప్రియురాలి ఇంటికి వచ్చి.. ఆమెను కిరోసిన్ పోసి తగులబెట్టాడు. దాంతో ఇంటి చుట్టుపక్కన గలవాళ్లు పోలీసులకు ఈ ఘోరాన్ని తెలియజేశారు. ఆ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సల్మాన్ తనే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకుని పోలిసులకు లొంగిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments