Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50కే క్వార్టర్ సీసా ఇప్పిస్తామన్న 'సారాయి వీర్రాజు' : సీపీఐ నేత రామకృష్ణ

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:23 IST)
తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రూ.50కే క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.50కే మద్యం బాటిల్ ఇపిస్తామన్న సోము వీర్రాజును ఇకపై 'సారాయి వీర్రాజు' అని పిలవాలేమో అని అన్నారు. 
 
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్‌ను కారు చౌకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుకుంటుంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులై పారిస్తామనడం సిగ్గుచేటన్నారు. 
 
రాష్ట్రంలో కోటి మంది మందు బాబులు ఉన్నారని, వారంతా బీజేపీ ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి 'సారాయి వీర్రాజు'గా పిలవాలేమో అని వ్యంగ్యంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments