Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ : సీపీఐ కె. నారాయణ

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (13:44 IST)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నారీ, క్యాబ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లీంలు నిరసనకు దిగారు. చెన్నై నుంచి తిరుపతికి వెలుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి తమకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడాలని వినతిపత్రం అందజేశారు.
 
ఈసంధర్భంగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ మత విద్వేషాలను రచ్చగొడుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి హిందువులు, ముస్లీంలు సోదరులు వలే దేశ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. మహాత్మ గాంధీ, ఇందీరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల‌ కేసులో ముస్లీంలు ఉన్నారా? లేక ప్రజా ధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళలో ముస్లీంలు ఉన్నారా? ఏవిధంగా ముస్లీంలను దేశ ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. 
 
బీజేపీ ఆప్రజాస్వామ్యక పాలన వలన గ్రామాల్లో మత విద్వేషాలు రగిలి ప్రాంతాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నామని, జాతి సమైఖ్యతకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నిరాజ్, చంద్రశేఖర్, సీపీఐ నాయకులు, స్థానిక ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments