Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ఆదేశిస్తాడు... జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడు...

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:30 IST)
ట్రూ అప్ ఛార్జీల పేరుతో క‌రెంటు ఛార్జీల‌ను వినియోగ‌దారుల‌పై మోప‌డాన్ని సిపిఐ ఖండిస్తోంది. ఇది కేంద్రం కుట్ర అని, దానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంద‌ని విమ‌ర్శించింది. విజ‌య‌వాడ‌లోని గుణదలలోని విద్యుత్ సౌదా కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. క‌రెంటు ఛార్జీల‌కు నిర‌స‌న‌గా, క‌రెంటు బిల్లుల‌ను సిపిఐ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. కేంద్రం నుంచి ప్ర‌ధాని మోడీ ఆదేశిస్తార‌ని, ఇక్క‌డ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దానిని పాటిస్తాడ‌ని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమ‌ర్శించారు.

ఏపీ సీఎం అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్ర‌దేశ్ పాలనను విస్మరించి, వ్యాపారాలపై దృష్టి పెట్టార‌ని ఆరోపించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోపిన రూ. 3966/- కోట్ల బకాయిలను వెంటనే రద్దు చేయాల‌ని డిమాండు చేశారు. అస‌లు ట్రూ అప్ ఛార్జీల పేరిట క‌రోనా సమ‌యంలో ప్ర‌జ‌ల‌పై భారాన్ని ఎందుకు మోపాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిని కేంద్ర‌మే భ‌రించాల‌ని, లేకుంటే రాష్ట్ర ప్ర‌భుత్వాలే భ‌రించాల‌న్నారు. అలా భ‌రించ‌లేని ప‌క్షంలో కేంద్రం నిర్ణ‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్య‌తిరేకించాల‌ని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments