Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో 78,322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:24 IST)
కృష్ణాజిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 78,322 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించామని జిల్లా కలెక్టర్‌ ఏయండి ఇంతియాజ్ అన్నారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఇంతియాజ్ కోవిడ్ ‌వ్యాక్సిన్ రెండవ విడత డోసు వేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లాలో 190 సెషన్స్ నిర్వహించడం ద్వారా 78 వేల 322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసామని తెలిపారు.

జిల్లాలో తొలివిడతగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరిగిందని, రెండవ విడతగా రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంద‌న్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైంద‌ని, ప్రజల్లో అపోహలు ఉంటే విడనాడాలన్నారు. బాలింతలు, గర్భిణి స్త్రీలు, పిల్లలు, అలర్జి ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోకూడదని కలెక్టర్ ఇంతియాజ్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments