శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా కల్లోలం: 12 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (20:22 IST)
శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి వచ్చారు. అలా ఊరెళ్లి వచ్చిన వారు మళ్లీ ఉద్యోగ విధుల్లోకి రావాలంటే పరీక్షలను షార్ అధికారులు తప్పనిసరి చేశారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 
 
సూళ్లూరుపేటలోని ఉద్యోగుల కాలనీల్లో పరీక్షలను ముమ్మరం చేశారు. ముందస్తు అనుమతితోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని.. వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లు వాడాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు షార్ ఉన్నతాధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments