Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగపోయింది. గత రెండు రోజుల క్రితం వరకు రెండు వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా ఆరు వేలను దాటిపోయాయి. దీంతో మంగళవారం రాత్రి నుంచి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
 
అదేసమయంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లోభాగంగా, ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ముఖ్యంగా, సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ మేరకు సినిమా ప్రదర్శనలు జరిపేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఆంక్షలు ఉల్లంఘించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
ఏమాత్రం చిన్నపాటి ఆంక్షలను సైతం ఉల్లంఘించినట్టు తేలితే తక్షణం నోటీసులు జారీచేస్తున్నారు. దీంతో థియేటర్ యజమానాలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఇపుడు కోవిడ్ ఆంక్షల పేరుతో అధికారులు పెడుతున్న ఇబ్బందులతో వారు విసిగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments