Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు

ఐవీఆర్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:38 IST)
విజయవాడ సింగ్ నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాయి దాడి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.
 
రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిందితుడు సతీష్ రెండుసార్లు రాయి విసిరాడు. మొదటిసారి విసిరిన రాయి తగలకుండా మిస్ అయిందనీ, అందువల్ల రెండవసారి మళ్లీ రాయి వేసినట్లు పేర్కొన్నారు. రాయితో ముఖ్యమంత్రి జగన్ పైన దాడి చేయాలని దుర్గారావు అనే వ్యక్తి చెప్పాడనీ, అతడి మాట ప్రకారం దాడి చేసాక తిరిగి అతడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చిందని పేర్కొన్నారు. 
 
మరోవైపు నిందితుడు సతీష్ తల్లి కోర్టు ముందు కన్నీటిపర్యంతమైంది. తమకేమీ తెలియదనీ, రోజు కూలీ చేసుకుని బతుకుతామని అన్నారు. 200 రూపాయల కోసం కక్కుర్తి పడ్డామనీ, ర్యాలీకి వస్తే డబ్బు ఇస్తామంటే వెళ్లామని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు లేకపోతే తాము చచ్చిపోతామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments