Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం : ఏడడుగుల వేడుకకు ఏడుగురు అతిథులు.. ఎక్కడ?

Andhra Pradesh
Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:59 IST)
పెళ్లంటే నూరెళ్లపంట. జీవితంలో అత్యంత మధురమైన ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగిన విధంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి పెళ్లిని కేవలం ఏడుగురు అతిథిల సమక్షంలో పూర్తికానిచ్చారు. ఈ వివాహ వేడుక విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం గరవపాలెం అనే గ్రామంలో. దీనికి కారణం కరోనా వైరస్ భయంతో పాటు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమల్లోవుండటమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గవరపాలెం తాకాశి వీధికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తికి ఏప్రిల్ 9వ తేదీ గురువారం వివాహం జరిపేలా గతంలోనే పెద్దలు నిశ్చయంచారు. సొంతూర్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భారీ కల్యాణ మండపం బుక్‌ చేసుకోవడమేకాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
ఈలోగా ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు ఆశలు అడియాశలయ్యాయి. పోలీసుల నిబంధన కారణంగా మండపంలో పెళ్లికే వీలుకాని పరిస్థితి.
 
అలాగని వివాహాన్ని వాయిదా వేసుకునేందుకు ఉభయ కుటుంబాలు ఇష్టపడక పోవడంతో నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ వివాహ వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments