ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 6045 కేసులు.. 65 మరణాలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:56 IST)
ఏపీలో కరోనా చెలరేగిపోతోంది. మృత్యు ఘంటికలు మోగిస్తూ రికార్డు స్థాయిలో ప్రాణాలను బలితీసుకుంటోంది. బుధవారం అత్యధికంగా 65 మంది కరోనాకు బలయ్యారు. 6045 మంది కరోనా బారిన పడ్డారు.

రాష్ట్రంలో వైరస్‌ విలయం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు 1 శాతం కంటే తక్కువ ఉన్న మరణాల శాతం నెమ్మదిగా 1.25 శాతానికి పెరిగింది.

తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1049, తూర్పుగోదావరిలో 891, గుంటూరులో 842, కర్నూలులో 678, పశ్చిమగోదావరిలో 672, చిత్తూరులో 345,  అనంతపురంలో 325, కృష్ణాలో 151, కడపలో 229, శ్రీకాకుళంలో 252,  ప్రకాశంలో 177, విజయనగరంలో 107, నెల్లూరుజిల్లాల్లో 327 మందికి పాజటివ్‌ వచ్చింది. 
 
భారత్‌లో...
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేరింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరటనిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments