Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 6045 కేసులు.. 65 మరణాలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:56 IST)
ఏపీలో కరోనా చెలరేగిపోతోంది. మృత్యు ఘంటికలు మోగిస్తూ రికార్డు స్థాయిలో ప్రాణాలను బలితీసుకుంటోంది. బుధవారం అత్యధికంగా 65 మంది కరోనాకు బలయ్యారు. 6045 మంది కరోనా బారిన పడ్డారు.

రాష్ట్రంలో వైరస్‌ విలయం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు 1 శాతం కంటే తక్కువ ఉన్న మరణాల శాతం నెమ్మదిగా 1.25 శాతానికి పెరిగింది.

తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1049, తూర్పుగోదావరిలో 891, గుంటూరులో 842, కర్నూలులో 678, పశ్చిమగోదావరిలో 672, చిత్తూరులో 345,  అనంతపురంలో 325, కృష్ణాలో 151, కడపలో 229, శ్రీకాకుళంలో 252,  ప్రకాశంలో 177, విజయనగరంలో 107, నెల్లూరుజిల్లాల్లో 327 మందికి పాజటివ్‌ వచ్చింది. 
 
భారత్‌లో...
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేరింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరటనిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments