Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నెమ్మదించిన కరోనావైరస్, యాక్టివ్ కేసులు 21,672 మాత్రమే

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (23:07 IST)
ఏపీలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా మహమ్మారి తగ్గుతున్న రాష్ట్రాల పట్టికలో ఏపీ కూడా తన స్థానాన్ని దక్కించుకుంటున్నది. గత కొన్ని వారాలుగా ఏపీలో నమోదవుతున్న కొత్త కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21,672 మాత్రమే.
 
మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. తాజా బులెటిన్ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 84,534 కరోనా టెస్టులు నిర్వహించగా కొత్తగా 2,849 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 436 కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 53 కేసులు వచ్చాయి.
 
అదే సమయంలో 3,700 మంది కరోనా నుంచి కోలుకోగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,30,731 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,02,325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,734కు పెరిగింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments