Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఉధృతం.. 199మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (15:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. కరోనా నియంత్రణకై ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. జూన్ ఫస్ట్ నుంచి కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కు చేరుకుంది. ఆదివారం మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మందికి.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా కొత్తగా ఇద్దరు కరోనా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 75మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో 17,695 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 199 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వారిలో 130 మంది ఏపీకి చెందినవారు కాగా, 69 మంది ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు. 30 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments