Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే రోజు 705మంది మృతి

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (10:55 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులు వరుసగా కరోనా కేసులు 50వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,661 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. ఇందులో 4,67,882 కేసులు యాక్టివ్ గా ఉంటె, 8,85,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 705 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,063కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,42,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,62,91,331కి చేరింది.
 
జులై 23 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 40,000కిపైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,40,000కిపైగా కరోనా కేసులతో పాటు 13,312 మరణాలు చోటుచేసుకున్నాయి.
 
కోవిడ్‌-19 కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, కంటైన్మెంట్‌ జోన్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. అయితే యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న రోగుల సంఖ్య రెట్టింపవడం ఊరట కలిగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments