Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు రద్దు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:43 IST)
కరోనా మమహమ్మారి కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూతబడ్డాయి. కేంద్ర  ప్రభుత్వం అన్లాక్ సడలింపులతో ఇప్పుడిప్పుడే కొన్ని ఆలయాలు దర్శనాలకు నోచుకుంటున్నాయి. కానీ కరోనా మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలకంగా దర్శనాలను సైతం నిలిపివేస్తున్నాయి.
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కరోనా కేసులు కలకలం రేపాయి. అంతర్వేది ఆలయంలో సేవలు అందించే నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో దేవాలయంలో దర్శనాలు రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో నేడు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
 
ఆలయంలో కరోనా కేసులు రావడం ఇది రెండోసారి. కేశ ఖండన సిబ్బందికి కరోనా రావడంతో ఇటీవల ఆ సేవలను కూడా రద్దు చేశారు. దీంతో ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అంతర్వేది రథాన్ని తగులబెట్టడంతో  పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై హిందూ దార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
 
ఆపై కొత్త రథాన్ని రూపొందించి పనులు కొనసాగిస్తున్నారు. తర్వాతి కాలంలో భక్తులు ఎక్కువ రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments