Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు రద్దు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:43 IST)
కరోనా మమహమ్మారి కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూతబడ్డాయి. కేంద్ర  ప్రభుత్వం అన్లాక్ సడలింపులతో ఇప్పుడిప్పుడే కొన్ని ఆలయాలు దర్శనాలకు నోచుకుంటున్నాయి. కానీ కరోనా మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలకంగా దర్శనాలను సైతం నిలిపివేస్తున్నాయి.
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కరోనా కేసులు కలకలం రేపాయి. అంతర్వేది ఆలయంలో సేవలు అందించే నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో దేవాలయంలో దర్శనాలు రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో నేడు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
 
ఆలయంలో కరోనా కేసులు రావడం ఇది రెండోసారి. కేశ ఖండన సిబ్బందికి కరోనా రావడంతో ఇటీవల ఆ సేవలను కూడా రద్దు చేశారు. దీంతో ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అంతర్వేది రథాన్ని తగులబెట్టడంతో  పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై హిందూ దార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
 
ఆపై కొత్త రథాన్ని రూపొందించి పనులు కొనసాగిస్తున్నారు. తర్వాతి కాలంలో భక్తులు ఎక్కువ రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments