Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కరోనా కలకలం.. 24 గంటల్లో ఏపీలో 70 కేసులు

Webdunia
శనివారం, 30 మే 2020 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2874కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

792మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే 2092 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 406మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగినవారు, సికింద్రాబాద్‌ నుండి బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments