Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కరోనా కలకలం.. 24 గంటల్లో ఏపీలో 70 కేసులు

Webdunia
శనివారం, 30 మే 2020 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2874కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

792మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే 2092 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 406మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగినవారు, సికింద్రాబాద్‌ నుండి బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments