Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా, టిటిడికి ఎంత నష్టమో? చరిత్రలో నిలిచిపోతుందా..?

Webdunia
సోమవారం, 18 మే 2020 (22:29 IST)
ఆపద మ్రొక్కులవాడా.. అనాథ రక్షకా గోవిందా..గోవిందా అంటే పలికే స్వామి తిరుమల వేంకటేశ్వరస్వామి. ఆ స్వామివారి దర్సనం కోసం ఎంతో శ్రమతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలాంటి ఆలయం మూసివేసి 50రోజులకు పైగా దాటుతోంది. దీంతో కోట్ల రూపాయల నష్టం టిటిడికి వచ్చింది.
 
అయితే టిటిడి లెక్కల ప్రకారం ప్రతి రోజు 5 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిత సేవా టిక్కెట్లు, హుండీ ఆదాయం, తలనీలాలు ఇలా వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ మొత్తం ఆదాయం నిలిచిపోయింది. మార్చి 20వ తేదీన ఆలయంలోకి భక్తుల అనుమతిని నిలిపివేశారు.
 
ఆ తరువాత మళ్ళీ భక్తులను ఎవరినీ అనుమతించడం లేదు. మళ్ళీ లాక్ డౌన్‌ను పొడిగించారు. ఈనెల చివరి వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది టిటిడి కూడా. దీంతో ఇప్పటివరకు మాత్రమే 285 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. 
 
ఇక తిరుమలలో వ్యాపారాల గురించి తెలిసిందే. భక్తుల కోసం టోపీలు, చిన్న చిన్న దండలు, హోటళ్ళు ఇలా ఎన్నో తిరుమలలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా మూతపడిపోయాయి. దీంతో చివరకు తిరుమలలో షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మళ్ళీ ఆలయంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు.. భక్తులతో తిరుమల ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎంతో ఆత్రుతగా స్థానిక షాపు యజమానులు ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments