Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం.. రొయ్యలంటేనే జడుసుకుంటున్న జనం

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:14 IST)
కరోనా వైరస్ ప్రభావంతో చైనా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఫలితంగా చైనా ఎగుమతి పడిపోయింది. ప్రస్తుతం రొయ్యల విషయంలోనూ అదే జరుగుతోంది. పెద్ద పెద్ద రొయ్యల్ని చైనా, జపాన్‌కి వ్యాపారులు ఎగుమతి చేస్తుంది. కానీ ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా రొయ్యలు ఎగుమతి కావట్లేదు. ఏపీలో రొయ్యల రైతులు... వారం నుంచీ రొయ్యల రేట్లను తగ్గిస్తున్నారు. 
 
ధరలు రోజురోజుకూ తగ్గించేయాల్సి వస్తుండటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రొయ్యల మేత రేటు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్తగా రొయ్యల మేత తయారీకి వాడే పదార్థాలు చైనా నుంచి దిగుమతి కావట్లేదు. అందుకే రొయ్యల మేత అమ్మే వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల రొయ్యల ధరలూ రూ.30 దాకా తగ్గాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గేవరకూ రొయ్యలు వద్దంటున్నాయి. 
 
దానికి తోడు కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే... మాంసాహారాలు, కోళ్లూ తినవద్దని డాక్టర్లు చెబుతుంటే... ప్రజలు మరింత టెన్షన్ పడుతూ... రొయ్యలు కొనడం తగ్గించేస్తున్నారు. అందువల్ల రొయ్యల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చైనా ప్రభావంతో ఇతర దేశాలకు చెందిన ప్రజలు మాంసాహారం తినాలంటే జడుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments